కేప్టౌన్ : సెమీఫైనల్లో భారత ఓటమికి ప్రయత్న లోపమే కారణమని ఆస్ట్రేలియా కీపర్-బ్యాటర్ అలిస్సా హీలీ వ్యాఖ్యానించింది. మహిళల టి20 ప్రపంచకప్ సెమీస్లో భారత జట్టు అయిదు పరుగుల తేడాతో ఓడిన అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీత్ తమ ఓటమికి దురదృష్టాన్ని సాకుగా చూపడం అలిస్సా తప్పుపట్టింది.
భారత జట్టులో గెలవాలన్న ప్రయత్న లోపమే వారి ఓటమికి కారణమన్నది. హర్మన్ప్రీత్, జెమీమా నాలుగో వికెట్కు 41 బంతుల్లో 69 పరుగులు జోడించి జట్టును విజయపథంలో నిలిపారు. అయితే 15వ ఓవర్లో హర్మన్ప్రీత్ రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్ అవడం మ్యాచ్ను మలుపుతిప్పింది.