లాహోర్: రెండు దశాబ్దాల అనంతరం పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్తోపాటు ఏకైక టీ20 మ్యాచ్ను సొంతం చేసుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. బుధవారం జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లకు 162/8 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆసీస్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది.
అర్ధ సెంచరీతో రాణించిన కెప్టెన్ అరోన్ ఫించ్ (55)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 24 ఏండ్ల అనంతరం పాక్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్, ఏకైక టీ20 మ్యాచ్ను సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్ను చేజార్చుకుంది. పాకిస్థాన్ 2-1తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.