ICC World Cup | తొలి మూడు ప్రపంచకప్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత ఐదుసార్లు జగజ్జేతగా నిలిచింది. భీకరమైన బౌలర్లు, బీభత్సం సృష్టించగల బ్యాటర్లతో దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ జగత్తును ఏకఛత్రాధిపత్యంతో ఏలిన కంగారూలు.. 1987, 1999, 2003, 2007, 2015లో వరల్డ్ చేజిక్కించుకున్నారు.
మైదానంలో తమ దేహ భాషతోనే ప్రత్యర్థిని హడలగొట్టే ఆసీస్.. కేవలం బ్యాట్, బాల్ కాకుండా.. నోటికి పని చెప్పడం ద్వారా కూడా ఆటపై ఆధిక్యం చూపిందనడంలో సందేహంలేదు! చాపెల్ బ్రదర్స్ నుంచి మొదలుకొని బోర్డర్, మార్క్ స్టీవ్ వా, రికీ పాంటింగ్, గిల్ హెడెన్, మెక్ షేన్ వార్న్, బ్రెట్ మైఖేల్ క్లార్క్ ఇలా ప్రపంచ స్థాయి ఆటగాళ్లెందరో ఆసీస్ ఐదుసార్లు విశ్వవిజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. మరో పది రోజుల్లో భారత్ వేదికగా ప్రతిష్ఠాత్మక వరల్డ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ ఐదు కప్పుల గురించి సంక్షిప్తంగా గుర్తుచేసుకుందాం..
-క్రీడావిభాగం
1987
అప్పటి వరకు జరిగిన మూడు ప్రపంచకప్లను ఇంగ్లండ్ నిర్వహించగా.. 1983లో చాంపియన్ నిలిచిన భారత్ ఈ సారి ఆతిథ్య బాధ్యతలు తీసుకుంది. దీంతో ప్రూడెన్షియల్ కప్ కాస్తా.. రిలయన్స్ కప్ మారిపోయింది. మొత్తం 8 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ ఉమ్మడిగా ఆతిథ్య హక్కులు పంచుకున్నాయి. గ్రూప్-ఎలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా చెరో 5 విజయాలు సాధించి 20 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలువగా.. సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమ్ ఓటమి పాలైతే.. మరో సెమీస్ పాకిస్థాన్ చిత్తుచేసిన ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగుపెట్టింది. తుదిపోరులో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించిన అలెన్ బోర్డర్ సారథ్యంలోని ఆస్ట్రేలియా తొలిసారి వరల్డ్ ముద్దాడింది.
1999
1987లో మొదటిసారి కప్పు కొట్టిన ఆసీస్ ఆ తర్వాత మరో రెండు టోర్నీల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక 1999లో జరిగిన టోర్నీకి మరోసారి ఇంగ్లండ్ వేదిక కాగా.. మొత్తం 12 మ్యాచ్ జరిగిన ఈ టోర్నీలో తొలిసారి సూపర్ సిక్స్ దశను ప్రవేశపెట్టారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా స్కోర్లు సమం కాగా.. లీగ్ దశలో సఫారీలపై నెగ్గిన కారణంగా ఆసీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. పాకిస్థాన్ జరిగిన తుదిపోరులో స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ ధాటికి పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది.
2003
దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన 2003 ప్రపంచకప్ డిఫెండింగ్ చాంపియన్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. టోర్నీ ఆరంభంలోనే టీమ్ గెలిచిన కంగారూలు.. చివరకు ఫైనల్లోనూ మరోసారి గంగూలీ సేనపై నెగ్గి ముచ్చటగా మూడోసారి కప్పు గెలుచుకున్నారు. 14 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ లీగ్ దశలో ఆస్ట్రేలియా ఆడిన అన్నీ మ్యాచ్ నెగ్గితే.. కేవలం కంగారూల చేతిలో ఓడిన టీమ్ రెండో స్థానంలో నిలిచింది. సూపర్ సిక్స్ శ్రీలంక, న్యూజిలాండ్ నెగ్గిన కంగారూలు.. సెమీస్ లంకను చిత్తుచేసి ఫైనల్ చేరారు. ఇక భారీ అంచనాల మధ్య టీమ్ జరిగిన ఫైనల్లో కంగారూల జోరు ముందు దాదా సేన నిలువ లేకపోయింది. మొదట ఆసీస్ 359 పరుగులు చేస్తే.. టీమ్ 234 పరుగులకే పరిమితమైంది. టోర్నీ ఆసాంతం రాణించి 673 పరుగులతో టాప్ స్కోరర్ నిలిచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి ఓవర్ వెనుదిరగడం భారత్ దెబ్బకొట్టింది.
2007
వరుసగా రెండోసారి డిఫెండింగ్ చాంపియన్ బరిలోకి దిగిన ఆసీస్.. 2007 వరల్డ్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. కరీబియన్ దీవుల్లో జరిగిన ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొనగా.. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ నెగ్గిన ఆసీస్ సూపర్-8లో ఏడు మ్యాచ్ జయకేతనం ఎగరవేసింది. సెమీస్ దక్షిణాఫ్రికాపై గెలిచిన కంగారూలు.. తుదిపోరులో శ్రీలంకను చిత్తుచేసి నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచారు. బ్రిడ్జ్ వేదికగా వర్షం అంతరాయం మధ్య సాగిన ఫైనల్లో ఓపెనర్ గిల్ సుడిగాలి సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ అలవోకగా గెలిచింది.
2015
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సమిష్టిగా ఆతిథ్యమిచ్చిన 2015 వన్డే ప్రపంచకప్ మైఖేల్ క్లార్క్ సారథ్యంలోని ఆసీస్ ఐదోసారి విజేతగా నిలిచింది.క్వార్టర్స్ పాక్ సునాయాసంగా గెలిచారు. సెమీస్ భారత్, ఆసీస్ మధ్య సాగిన పోరుకు రికార్డు స్థాయిలో దాదాపు లక్ష మంది ప్రేక్షకులు హాజరు కాగా.. స్మిత్ సెంచరీకి ఫించ్ మెరుపులు తోడవడంతో మొదట ఆసీస్ 328 పరుగులు చేస్తే.. ఛేదనలో టీమ్ 233 పరుగులకే పరిమితమై పరాజయం పాలైంది. కివీస్ జరిగిన ఫైనల్లోనూ ఆసీస్ ఐదోసారి విశ్వ విజేతగా అవతరించింది.