న్యూఢిల్లీ: ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనున్నది. ఆసీస్ జట్టులో రెండు మార్పులు చేశారు. బ్యాటర్ రెన్షా స్థానంలో ట్రావిస్ హెడ్, బోలాండ్ స్థానంలో కునేమాన్ జట్టులో చేరారు. ఇక ఇండియా కూడా ఈ టెస్టుకు ఓ మార్పు చేసింది. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ను ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్కు చోటు కల్పించారు. నాగపూర్లో జరిగిన తొలి టెస్టులో ఇండియా .. ఇన్నింగ్స్ 132 రన్స్ తేడాతో ఆసీస్పై విజయం సాధించిన విషయం తెలిసిందే.
🚨 Toss Update from Arun Jaitley Stadium 🚨
Australia have elected to bat against #TeamIndia in the second #INDvAUS Test.
Follow the match ▶️ https://t.co/hQpFkyZGW8 @mastercardindia pic.twitter.com/7tE78dLYVi
— BCCI (@BCCI) February 17, 2023
పూజారా వందో టెస్టు..
ఇండియన్ బ్యాటర్ పూజారాకు ఇది వందో టెస్టు కానున్నది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటన్ గవాస్కర్ తన చేతుల మీదుగా పూజారాకు క్యాప్ అందజేశారు. సెంచరీ క్లబ్లో చేరిన పూజారాకు గవాస్కర్ స్వాగతం పలికాడు.
A special landmark 👌
A special cricketer 👍
A special hundred 💯
Congratulations to @cheteshwar1 as he plays his 1⃣0⃣0⃣th Test 👏 👏
Well done 🙌 🙌
Follow the match ▶️ https://t.co/hQpFkyZGW8 #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/c5tXFVuhDI
— BCCI (@BCCI) February 17, 2023