హనుమకొండ చౌరస్తా : క్రీడాకారులు (Athletes ) పతకాలు సాధించి జాతీయస్థాయిలో రాణించాలని మాజీ ఇండియన్ ఉమెన్స్ హాకీ మాజీ టీం కోచ్ మధుకరణ్ ( Madhukaran ) సూచించారు. 8వ తెలంగాణ హ్యాండ్ బాల్( Hand Ball ) ట్యాలెంట్ హంట్, 41వ సౌత్ ఇండియా హ్యాండ్బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హ్యాండ్బాల్ కోర్టులో రెండోరోజు హోరాహోరీగా కొనసాగాయి.
మూడురోజుల ఈ పోటీలను డీఎస్పీ(ఏఆర్), జాతీయ హ్యాండ్బాల్ ప్లేయర్ పీఎస్ శశిధర్ జ్ఞాపకార్థం రెడ్ షూటర్స్ అండ్ తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్కుమార్ తెలిపారు. రెండోరోజు మధుకరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించి మాట్లాడారు.
క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో దోహదపడతాయని, హ్యాండ్బాల్ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి భారత్కు పతకాలు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా మధుకరణ్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి శ్యాం, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.