బిష్కెక్: ఒలింపిక్స్ బెర్తులు నిర్ణయించే ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్లో భారత అమ్మాయిలు అదరగొట్టినా అబ్బాయిలు మాత్రం నిరాశపరిచారు. గ్రీకో రోమన్ విభాగంలో ఒక్కరంటే ఒక్కరు కూడా సెమీస్కు చేరుకోలేదు. ఈ కేటగిరీలో భారత్ నుంచి పోటీపడ్డ వికాస్, సునీల్, నితేశ్, నవీన్లు క్వార్టర్స్ కూడా దాటలేదు. 87 కిలోల విభాగంలో సునిల్.. అర్హత రౌండ్లో 5-1 తేడాతో జపాన్ రెజ్లర్ సోహ్ సకాబెను ఓడించినా క్వార్టర్స్లో చేతులెత్తేశాడు.
బిష్కెక్లో భారత పురుష రెజ్లర్ల ప్రదర్శనలతో నిరాశచెందిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మళ్లీ కొత్తగా సెలక్షన్ ట్రయల్స్ను నిర్వహించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బిష్కెక్లో మనోళ్లు బెర్తులు దక్కించుకునేందుకు విఫలమైన 14 కేటగిరీలలో సెలక్షన్స్ నిర్వహించి మే 9 నుంచి టర్కీ వేదికగా జరగాల్సి ఉన్న వరల్డ్ క్వాలిఫయర్స్కు పంపేందుకు సిద్ధమవుతున్నట్టు సమచారం. ఒలిపింక్స్లో బెర్తులు దక్కించుకునేందుకు రెజ్లర్లకు వరల్డ్ క్వాలిపయర్సే చివరి అవకాశం.