Asian Games 2023 | న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్లోనే బరిలోకి దిగనున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా.. భారత్తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు క్వార్టర్స్కు అర్హత సాధించాయి. చైనాలో జరుగనున్న ఏషియన్ గేమ్స్లో పురుషుల విభాగంలో 18 జట్లు, మహిళల విభాగంలో 14 టీమ్లు పోటీ పడుతున్నాయి.
మహిళల పోటీలు సెప్టెంబర్ 19న ప్రారంభమై 26న ముగియనుండగా.. పురుషుల టోర్నీ 28న ప్రారంభమై అక్టోబర్ 7 ఫైనల్తో ముగియనుంది. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్పై రెండు మ్యాచ్ల నిషేధం కొనసాగుతుండటంతో.. టీమ్ఇండియా ఫైనల్కు అర్హత సాధిస్తేనే.. హర్మన్ ఆసియా క్రీడల బరిలో దిగనుంది.