దుబాయ్: పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో ఆసియా దేశాలన్నీ.. ప్రతిష్ఠాత్మక టోర్నీకి సిద్ధమయ్యాయి. శనివారం నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్నకు తెరలేవనుండగా.. తొలి మ్యాచ్లో శ్రీలంకతో అఫ్గానిస్థాన్ తలపడనుంది. డబుల్ రౌండ్రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగనున్న ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్తో పాటు క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తాచాటిన హాంకాంగ్ జట్టు కప్పు కోసం పోటీ పడనున్నాయి. క్షణాల్లో అంచనాలు తారుమారయ్యే టీ20 ఫార్మాట్లో విజేతను ఊహించడం కష్టం కాగా.. టీమ్ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగనుంది.
టీమ్ఇండియా ప్రాక్టీస్.. ప్రాక్టీస్
చాన్నాళ్ల తర్వాత సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో కూడిన భారత జట్టు ఓ మెగాటోర్నీ కోసం సిద్ధమవుతుండగా.. కొన్నాళ్లుగా విశ్రాంతిలో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ అధికారిక ట్విట్టర్లో పొందుపరిచింది. భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, అర్శ్దీప్ సింగ్, అశ్విన్, రవి బిష్ణోయ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయగా.. కోహ్లీ, రోహిత్, రాహుల్, పంత్, పాండ్యా, కార్తీక్ బ్యాటింగ్ సాధన చేశారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నెట్స్లో భారీ షాట్లు ఆడుతూ కనిపించాడు.