IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్కు మరో మూడు రోజులే ఉంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) తొలి పోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టీమిండియా క్రికెటర్లకు కూడా టికెట్లు దొరకని పరిస్థితి. దాంతో, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(R Ashwin) తాజాగా చెన్నై మేనెజ్మెంట్కు ఓ విజ్ఞప్తి చేశాడు. తన పిల్లలకు మ్యాచ్ టికెట్లు ఇప్పించాలని సీఎస్కేను అభ్యర్థిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘చెపాక్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ టికెట్లకు ఎక్కడలేని డిమాండ్ ఉంది. నా కూతుళ్లు ఐపీఎల్ ఆరంభ వేడుకలను చూడాలని ఆశపడుతున్నారు. ప్లీజ్ సీఎస్కే వాళ్లకు సాయం చేయండి’ అని అశ్విన్ తన పోస్ట్లో రాసుకొచ్చాడు.
Unreal ticket demand for the #CSKvRCB #IPL2024 opener at Chepauk.
My kids want to the see opening ceremony and the game.@ChennaiIPL pls help🥳— Ashwin 🇮🇳 (@ashwinravi99) March 18, 2024
మార్చి 22న జరిగే ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ టికెట్లను.. మార్చి 18న ఉదయం 9:30 గంటలకు పేటీఎమ్ ఇన్సైడర్(Paytm Insider)లో అమ్మకానికి పెట్టారు. టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడడంతో కాసేపటికే పేటీఎమ్ ఇన్సైడర్ క్రాష్ అయిన విషయం తెలిసిందే.
వందో టెస్టు మ్యాచ్ క్యాప్ అందుకుంటూ..
చెన్నై మాజీ ఆటగాడైన అశ్విన్ రిక్వెస్ట్ను యాజమాన్యం అంగీకరిస్తుందా? లేదా? చూడాలి. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో అశ్విన్ ఏడేండ్లు పసుపు రంగు జెర్సీతో ఆడాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి 2017 వరకు అతడు సీఎస్కేతో కొనసాగాడు. 17వ సీజన్లో ఈ స్టార్ ఆల్రౌండర్ రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. అశ్విన్ ఈ మధ్యే టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్లో చేరాడు. అంతేకాదు ఇంగ్లండ్ సిరీస్లో ఆఖరిదైన ధర్మశాలలో కుటుంబ సభ్యుల సమక్షంలో 100వ టెస్ట్ మ్యాచ్ క్యాప్ను అందుకున్నాడు.