Ashwin – Jadeja : భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin), రవీంద్ర జడేజా (Ravindra Jadeja)లు బంతి అందుకున్నారంటే ప్రత్యర్థులకు వణుకే. హిట్ పెయిర్గా గుర్తింపు పొందిన వీళ్లిద్దరూ టెస్టుల్లో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. అలాంటి ఈ జోడీకి ఉప్పల్ స్టేడియంలో భంగపాటు ఎదురైంది.
రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి అశ్విన్, జడ్డూలు చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఈ స్టార్ స్పిన్నర్లు ఏకంగా వందకు పైగా పరుగులు సమర్పించుకున్నారు.
First time Ashwin & Jadeja have conceded over 100 each in an opposition’s second innings in India 😯#INDvENG pic.twitter.com/up0xuXkYQv
— ESPNcricinfo (@ESPNcricinfo) January 28, 2024
రెండో ఇన్నింగ్స్లో 29 ఓవర్లు వేసిన అశ్విన్ 3 వికెట్లు తీసినప్పటికీ ఏకంగా 126 పరుగులిచ్చాడు. జడ్డూ తన 34 ఓవర్ల స్పెల్లో తీసింది రెండే రెండు వికెట్లు. కానీ, 131 పరుగులు ఇచ్చాడు. వీళ్లిద్దరూ ఒక జట్టుపై రెండో ఇన్నింగ్స్లో వందకు పైగా రన్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి.
Ashwin breaks an 80-run partnership!
Tom Hartley does a splendid job for his team – out for 34
— ESPNcricinfo (@ESPNcricinfo) January 28, 2024
ఉప్పల్ టెస్టులో బంతితో మాయ చేసిన అశ్విన్, జడ్డూలు 511 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. తద్వారా భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(Anil Kumble) – హర్భజన్ సింగ్(Harbhajan Singh)లు గతంలో నెలకొల్పిన 501 వికెట్ల రికార్డును అధిగమించారు.