Ravichandran Ashwin : భారత సీనియర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) మరో ఘనత సాధించాడు. టెస్టు ఫార్మాట్లో ఇంగ్లండ్(England)పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. వైజాగ్ టెస్టులో ఓలీ పోప్(Ollie Pope)ను ఔట్ చేసిన అశ్విన్ ఇంగ్లండ్పై 96 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
తద్వారా.. గతంలో 95 వికెట్లతో స్పిన్నర్ బీఎస్ చంద్రశేఖర్(BS Chandrashekar) నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్పై అత్యధిక వికెట్లు తీసిన ఐదుగురు భారత బౌలర్లు ఎవరంటే..? అశ్విన్ 96 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా.. బీఎస్ చంద్రశేఖర్ 95 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
రవిచంద్రన్ అశ్విన్
ఇంగ్లండ్పై 92 వికెట్లు తీసిన లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(Anil Kumble) మూడో స్థానానికి పరిమితమయ్యాడు. బిషన్సింగ్ బేడీ, ఆల్రౌండర్ కపిల్ దేవ్(Kapil Dev)లు 85 వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. పేసర్ ఇషాంత్ శర్మ 67 వికెట్లు పడగొట్టి ఐదో స్థానంలో నిలిచాడు.
Sharp Reflexes edition, ft. captain Rohit Sharma! 👌 👌
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @ImRo45 | @IDFCFIRSTBank pic.twitter.com/mPa0lUXC4C
— BCCI (@BCCI) February 5, 2024
ఉప్పల్ టెస్టులో ఆరు వికెట్లు తీసిన అశ్విన్ వైజాగ్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ప్రభావం చూపలేకపోయాడు. 12 ఓవర్లలో 61 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీయలేదు. రెండో ఇన్నింగ్స్లో మూడో రోజు బెన్ డకెట్(28)ను ఔట్ చేసిన అశ్విన్… నాలుగో రోజు మాత్రం కీలక వికెట్లు పడగొట్టి భారత్ను పోటీలోకి తెచ్చాడు. ప్రమాదకరమైన ఓలీ పోప్(23), జో రూట్(16)లను ఔట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. సొంతగడ్డపై మెరుగైన రికార్డు ఉన్ అశ్విన్ మరో వికెట్ తీస్తే 500 వికెట్ల క్లబ్లో చేరుతాడు.