POCSO Act: భారత స్టార్ హాకీ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత అయిన వరుణ్ కుమార్పై బెంగళూరు పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. వరుణ్ కుమార్ తనను పెండ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 22 ఏండ్ల అమ్మాయి ఒకరు అతడిపై ఫిర్యాదుచేసింది. 2018లో తనకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వరుణ్.. తాను మైనర్ (17 ఏండ్ల వయసుండగా)గా ఉన్న సమయంలో ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమే గాక పలుమార్లు రేప్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.
ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు వరుణ్పై పోక్సో చట్టంతో పాటు సెక్షన్ 376 (రేప్), సెక్షన్ 420(చీటింగ్) ల కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. వరుణ్కుమార్ ప్రస్తుతం భువనేశ్వర్లో ఉన్నాడు. త్వరలో జరగాల్సి ఉన్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్కు అతడు సిద్ధమవుతున్నాడు. ఈ కేసుపై అతడింకా స్పందించాల్సి ఉంది. భారత హాకీ జట్టుకు చేసిన సేవలకు గాను 2021లో కేంద్ర ప్రభుత్వం అతడిని అర్జున అవార్డుతో సత్కరించింది.
#Arjunaaward-winning Indian #hockey player #VarunKumar was on Tuesday booked under the #POCSO act by the #Bengaluru #Police after a woman accused the defender of sexually abusing her multiple times when she was a minor. pic.twitter.com/X3GYEvhU82
— BuzzingBharatNews (@BuzzingBharat) February 6, 2024
హిమాచల్ప్రదేశ్కు చెందిన వరుణ్.. 2017లో జాతీయ జట్టుకు ఎంట్రీ ఇచ్చాడు. 28 ఏండ్ల వరుణ్.. గతేడాది హాంగ్జౌ (చైనా) వేదికగా ముగిసిన ఆసియా క్రీడలలో స్వర్ణం నెగ్గిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అంతకుముందు 2022 కామన్వెల్త్ గేమ్స్లో భారత్ రజతం గెలిచిన జట్టులోనూ అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకూ జాతీయ జట్టు తరఫున 142 మ్యాచ్లు ఆడిన వరుణ్.. 40 గోల్స్ సాధించాడు.