అండర్-20 ప్రపంచ ఛాంపియన్షిప్స్ టోర్నీలో భారత రెజ్లర్ అంతిమ్ అద్భుతంగా రాణించింది. వరుస విజయాలతో 53 కేజీల కేటగిరీలో ఫైనల్కు దూసుకొచ్చిన ఈ యువ రెజ్లర్.. బల్గేరియాలోని సోఫియా వేదికగా జరిగిన తుది పోరులో కజకస్థాన్కు చెందిన అల్టీన్ షగయేవాపై సునాయాస విజయం సాధించింది. మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అంతిమ్.. 8-0 తేడాతో అల్టీన్ను మట్టికరిపించి స్వర్ణపతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా అండర్-20 ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తొలి భారత మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించింది.
17 ఏళ్ల అంతిమ్ ఈ ఏడాది జరిగిన ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్స్లో కూడా స్వర్ణం ముద్దాడింది. కామన్వెల్త్ క్రీడల్లో కూడా ఆడాల్సింది. కానీ ఆ మెగాటోర్నీ కోసం జరిగిన అర్హత పోటీల్లో వినేష్ ఫోగట్ చేతిలో ఓటమిపాలై.. కామన్వెల్త్ క్రీడలు మిస్ అయింది. ఈ ఓటమితో తను చాలా కుంగిపోయానని, కానీ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో విజయంతో మళ్లీ స్ఫూర్తి పొందానని అంతిమ్ తెలిపింది. సీనియర్ లెవెల్లో కూడా రాణించడమే తన లక్ష్యమని చెప్పింది.
💐Heartiest congratulations #ANTIM #Gold🥇#Medal
17-year-old Antim (53kg) becomes 🇮🇳's 1st-ever U20 World Champion in women’s #wrestling at #WrestleSofia Antim also defeated U20 European Champ 🇩🇪's Amory Andrich (11-0) in the 1st round🤼♀️🤼♂️ pic.twitter.com/2tqSITp7wk
— Sandeep Singh (@flickersingh) August 20, 2022