కొన్నిరోజుల క్రితం అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణపతకం సాధించిన రెజ్లర్ అంతిమ్ పంఘాల్ మరోసారి సత్తా చాటింది. 36వ జాతీయ క్రీడల్లో కూడా బంగారు పతకం తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో 53 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన అంతిమ్.. మధ్యప్రదేశ్కు చెందిన రెజ్లర్ ప్రియాన్షీ ప్రజాపతిని ఓడించింది.
జాతీయ క్రీడల్లో అంతిమ్ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇలా తొలిసారే స్వర్ణపతకాన్ని తన ఖాతాలో వేసుకున్న అంతిమ్ చరిత్ర సృష్టించింది. ఆగస్టు నెలలో జరిగిన అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కూడా అంతిమ్ స్వర్ణపతకం సాధించింది.