హైదరాబాద్: ఆంధ్ర, హైదరాబాద్ మధ్య రంజీ పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిపత్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో ఆంధ్ర కీలకమైన ఆధిక్యం దక్కించుకుంది. హైదరాబాద్ బౌలింగ్ను సమర్థంగా నిలువరిస్తూ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.
ఓపెనర్ జ్ఞానేశ్వర్(72), శ్రీకర్ భరత్(70 నాటౌట్) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న ఆంధ్ర ప్రస్తుతం 168 పరుగుల కీలక ఆధిక్యంలో కొనసాగుతున్నది. రక్షణ్రెడ్డి(3/65)కి మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 79/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 197 పరుగులకు ఆలౌటైంది. శశాంక్ (47) టాప్ స్కోరర్గా నిలువగా, మిగతావారు ఘోరంగా తేలిపోయారు. నితీశ్కుమార్రెడ్డి (4/64), శశికాంత్ (3/40) హైదరాబాద్ పతనాన్ని శాసించారు.