గోల్నాక: జాతీయ తైక్వాండో చాంపియన్షిప్లో అంబర్పేట విద్యార్థులు సత్తాచాటారు. గత వారం జరిగిన టోర్నీలో కవిత తైక్వాండో అకాడమీకి చెందిన 60 మంది విద్యార్థులు స్పీడ్కిక్కింగ్, పూమ్సీ, కొరిగి విభాగాల్లో పోటీపడ్డారు.
ఇందులో 21 స్వర్ణాలు, 21 రజతాలు, 18 కాంస్యాలు మొత్తం 60 పతకాలు సాధించారు. పతకాలు సాధించిన ప్లేయర్లను శిక్షకులు జయంత్రెడ్డి, కవిత అభినందించారు.