Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ల పరాజయాల ప్రస్థానం కొనసాగుతున్న వేళ యువకెరటం అమన్ షెరావత్ (Aman Sherawat) పంజా విసిరాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో తన ఉడుంపట్టుతో అల్బేనియా రెజ్లర్పై అమన్ జయభేరి మోగించాడు.
పురుషుల 57 కిలోల విభాగంలో అల్బేనియాకు చెందిన అబరకొవ్ జెలిమ్ఖాన్(Abarakov Zelimkhan)ను చిత్తుగా ఓడించి సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. సాంకేతిక అంశాల పరంగా 12-0తో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఫైనల్ బెర్తు కోసం జరిగే పోరులో టాప్ సీడ్ రీ హిగుచి(జపాన్)తో అమన్ తలపడనున్నాడు. మరో మ్యాచ్లో అన్షు మాలిక్ (Anshu Malik) నిరాశపరిచింది. 57 కిఓలల విభాగం తొలి రౌండ్లోనే అమెరికా రెజ్లర్ హెలెన్ లూయిసె మరోలిస్ (Helen Louise Maroulis) చేతిలో ఓటమి పాలైంది.
🇮🇳 𝗔𝗺𝗮𝗻 𝗽𝗼𝘄𝗲𝗿𝘀 𝘁𝗵𝗿𝗼𝘂𝗴𝗵 𝘁𝗼 𝘁𝗵𝗲 𝘀𝗲𝗺𝗶𝘀! A massive performance from Aman Sehrawat to win his quarter-final bout against Zelimkhan Abakarov to advance to the semi-final.
🙌 Final score: Aman 12 – 0 Zelimkhan
⏰ He will next take on 1st seed, Rei… pic.twitter.com/j5C2VOofEK
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 8, 2024
బీజింగ్ ఒలింపిక్స్ నుంచి ప్రతిసారి విశ్వ క్రీడల్లో దేశానికి ప్రతిసారి పతకం అందించే క్రీడ రెజ్లింగ్. ఈసారి కూడా వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) స్వర్ణం గెలుస్తందని యావత్ భారతం ఆశించింది. కానీ, 100 గ్రాముల అదనపు బరువుతో ఆమె అనర్హత గురవ్వడంతో, తొలి రౌండ్లోనే అంతిమ్ పంగల్ సైతం నిరాశపరచడంతో పతకం ఆశలు ఆవిరైనట్టే అనిపించింది.
అయితే.. 21 ఏండ్ల అమన్ షెరావత్ మెడల్ గెలిచేందుకు నేనున్నాంటూ సెమీస్కు చేరి మళ్లీ ఆశలు చిగురింపజేశాడు. కానీ.. వరల్డ్ నంబర్ 1 ర్యాంకర్ హిగుచితో అతడికి గట్టి సవాల్ ఎదురవ్వడం ఖాయం. ఒకవేళ అంచనాలకు మించి రాణిస్తే అమన్ చరిత్ర సృష్టించే అవకాశముంది.