CWC 2023: వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో దూకుడుమీదున్న భారత జట్టుకు మరో గుడ్ న్యూస్. కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడి న్యూజిలాండ్తో పాటు ఇంగ్లండ్ మ్యాచ్లకూ దూరమైన హార్ధిక్ పాండ్యా త్వరలోనే భారత జట్టుతో కలవనున్నాడు. నవంబర్ 2న భారత జట్టు.. ముంబై వేదికగా శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ నాటికి హార్ధిక్ పాండ్యా.. ముంబైలో జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచిన భారత జట్టు ఇదివరకే సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇకనుంచి భారత్ ఆడబోయే మ్యాచ్లలో ఒక్క సౌతాఫ్రికా మాత్రమే కాస్త కఠినమైన ప్రత్యర్థి కాగా మిగిలినవి శ్రీలంక, నెదర్లాండ్స్. ఇదివరకే సెమీస్ బెర్తు ఖాయమైన నేపథ్యంలో పాండ్యాను లంకతో మ్యాచ్లో ఆడించేది అనుమానమేనని సమాచారం. కాలి మడమ గాయంతో బాధపడుతున్న పాండ్యా ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిటేషన్ పొందుతున్నాడు.
Hardik Pandya has resumed the batting and gym session. [RevSportz]
– Great news for Team India…..!!!!! pic.twitter.com/8JF7Zj0zJw
— Johns. (@CricCrazyJohns) October 28, 2023
అప్రధాన మ్యాచ్లలో హార్ధిక్ ను తీసుకొచ్చి తిరిగి గాయాన్ని పెద్దది చేయడం కంటే సెమీస్ వరకూ విరామం ఇవ్వడమే బెటర్ అని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘అవును, పాండ్యా ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్నాడు. త్వరలోనే అతడు ముంబైలో టీమిండియాతో కలుస్తాడు. అయితే అతడు లంకతో మ్యాచ్లో ఆడతాడనేది మాత్రం కచ్చితంగా చెప్పలేం. కానీ అతడు జట్టుతో పాటు కొనసాగుతాడు..’ అని తెలిపాడు.