Akash Chopra : వన్డే వరల్డ్ కప్ లీగ్ దశలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) గాయపడడంతో ఆరో బౌలర్ కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆస్టేలియాతో జరిగిన టైటిల్ పోరులో పాండ్యా లేని లోటు స్పష్టంగా తెలిసొచ్చింది. సూర్యకుమార్ స్థానంలో పాండ్యా ఆడిఉంటే ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించేవాడని అనుకోని భారత అభిమాని లేరు. అందుకనే ఇకనైనా పాండ్యాకు బ్యాకప్గా ఒకరిద్దరు ఆల్రౌండర్లను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) ఈ విషయంపై స్పందిస్తూ.. పాండ్యాకు బ్యాకప్గా యువ ఆల్రౌండర్లు వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer), శివం దూబే(Shivam Dube), విజయ్ శంకర్(Vijay Shankar)లను తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు.
హార్దిక్ పాండ్యా
టీమిండయాకు కావాల్సిన ఆల్రౌండర్లను సానబెట్టాల్సిన పనిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు చేయలేవని, బీసీసీఐనే ఆ బాధ్యత తీసుకోవాలని చోప్రా తెలిపాడు. ‘ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో టాప్ సిక్స్ బ్యాటర్లలో ఒక్క బౌలర్ కూడా లేడు. అందుకని నిఖార్సైన ఆల్రౌండర్ల అవసరం చాలా ఉంది. అయితే.. గతంలో ఐపీఎల్ జట్లు ఈ పని చేసేవి. కానీ, 16వ సీజన్లో
వెంకటేశ్ అయ్యర్, శివం దూబే
తీసుకొచ్చిన ‘ఇంప్యాక్ట్ ప్లేయర్’ నిబంధనతో ఆల్రౌండర్లకు అవకాశాలు తగ్గిపోయాయి. అందుకని బీసీసీఐనే ఆల్రౌండర్లను సానబెట్టే బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా ద్వైపాక్షిక సిరీస్లలో ఆ పని చేయాలి. కానీ, అలా చేయడం లేదు’ అని కామెంటేటర్ చోప్రా వెల్లడించాడు.