WFI: ఏడాదికాలంగా కుస్తీ పోటీలు లేక విలువైన కెరీర్ కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసనకు దిగిన జూనియర్ రెజ్లర్లకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అడ్ హక్ కమిటీ గుడ్ న్యూస్ చెప్పంది. ఆరు వారాల్లో అండర్ -15, అండర్ – 20 నేషనల్ ఛాంపియన్షిప్స్ నిర్వహిస్తామని తెలిపింది. గ్వాలియర్ (మధ్యప్రదేశ్) వేదికగా ఈ పోటీలు ఉంటాయని అడ్హక్ కమిటీ చైర్మన్ భూపీందర్ సింగ్ బజ్వా ఓ ప్రకటనలో వెల్లడించారు. యువ రెజ్లర్లు ఈ పోటీలకు సన్నద్ధం కావాలని కోరారు.
బుధవారం మధ్యాహ్నం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద వందలాది యువ రెజ్లర్లు.. సీనియర్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్లకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ ముగ్గురి వల్ల తమ కెరీర్లు ప్రమాదంలో పడ్డాయని ఆరోపిస్తూ వాళ్లు నిరసన చేపట్టారు. ఆ ముగ్గురూ ఒకవైపు ఉంటే దేశంలో రెజ్లర్లంతా మరోవైపు ఉన్నారని, రెజ్లింగ్ సమాఖ్య తమ గురించి కూడా ఆలోచించాలని నినదించారు.
जंतर मंतर पर आज #WFI से सस्पेंड हुए संजय सिंह के पक्ष में पहलवान @BajrangPunia @SakshiMalik @Phogat_Vinesh के ख़िलाफ़ प्रदर्शन कर रहे हैं। #Wrestlers #wfisuspended pic.twitter.com/1piRHWdZbH
— Milan Sharma (@Milan_reports) January 3, 2024
గతేడాది డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక ఆరోపణలు, ఆయనను అరెస్టు చేయాలని ఈ ముగ్గురితో పాటు మరికొందరు రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద జనవరి, ఏప్రిల్లో నిరసనకు దిగిన విషయం తెలిసిందే. 2023 మొత్తం రెజ్లర్ల నిరసనలు, డబ్ల్యూఎఫ్ఐపై నిషేధం కారణంగా ఆ ఏడాది అటు సీనియర్ గానీ ఇటు జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్ నిర్వహించలేదు. కొద్దిరోజుల క్రితమే అడ్హక్ కమిటీ.. ఫిబ్రవరి 2 నుంచి సీనియర్ నేషనల్ ఛాంపియన్స్ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జూనియర్, సబ్ జూనియర్ లెవల్లో కూడా నేషనల్స్ నిర్వహిస్తామని స్పష్టతనివ్వడం గమనార్హం. అడ్హక్ కమిటీ తాజా ప్రకటన ప్రకారం.. ఫిబ్రవరిలో సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ముగిసిన తర్వాత జూనియర్ నేషనల్స్ మొదలయ్యే అవకాశముంది.