T20 World Cup 2024 : వన్డే వరల్డ్ కప్ ముగిసిందో లేదో మరో మెగా టోర్నీకి కౌంట్డౌన్ మొదలైంది. సొంతగడ్డపై ప్రపంచ కప్ చేజారడంతో వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచ కప్ 2024పై టీమిండియా(Team India) గురిపెట్టగా.. మిగతా జట్లు కూడా చాంపియన్ అవ్వాలనే కసితో ఉన్నాయి. ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 18 జట్లు అర్హత సాధించాయి. దాంతో చివరి రెండు బెర్తులు దక్కించుకొనే జట్లు ఏవి? అనే ఆసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది.
అయితే.. నమీబియా వేదికగా రేపటి నుంచి మొదలయ్యే ఆఫ్రికా క్వాలిఫయర్(Africa Qualifer)తో ఆ ఉత్కంఠకు తెరపడనుంది. ఈ టోర్నీలో ఆతిథ్య నమీబియా, జింబాబ్వేతో పాటు కెన్యా, నైజీరియా, రువాండా, టాంజానియా, ఉంగాడా జట్లు పోటీపడుతున్నాయి. సింగిల్ రౌండ్ రాబిన్(Single Round Robin) పద్దతిలో జరిగే ఈ క్వాలిఫయర్లో ఫైనల్ చేరిన జట్లు టీ20 వరల్డ్ కప్లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంటాయి.
The final two spots at #T20WorldCup 2024 up for grabs!
More as some of Africa’s best vie for tickets to the USA and the Caribbean 🏆https://t.co/JYH7hlvWdX
— ICC (@ICC) November 21, 2023
జింబాబ్వే జట్టు తొలిసారి సికిందర్ రజా(Sikinder Raza) సారథ్యంలో బరిలోకి దిగుతోంది. గత కొంత కాలంగా టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న నమీబియా, కెన్యా, ఉగాండాతో జింబాబ్వేకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.పొట్టి వరల్డ్ కప్ 2024కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్లో టోర్నీ ఉన్నందున ఐసీసీ మ్యాచ్ల వేదికలను ఖరారు చేసింది కూడా.
మెగా టోర్నీకి అర్హత సాధించిన 18 జట్లు ఇవే.. వెస్టిండీస్, భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, అమెరికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, అఫ్గనిస్థాన్, నేపాల్, ఒమన్, కెనడా, పపువా న్యూగినియా, ఐర్లాండ్, స్కాట్లాండ్.