ODI World Cup | 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. పాక్ స్పిన్, పేస్ బౌలింగ్ను ఎదుర్కొని ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 49వ ఓవర్లో షాహిన్ షా అఫ్రిది వేసిన చివరి బంతిని హస్మతుల్లా బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీకి పంపి విన్నింగ్ షాట్ కొట్టారు.
తొలుత పాకిస్థాన్ భారీగానే పరుగులు చేసినా.. తదుపరి బ్యాటింగ్ కు వచ్చిన ఆఫ్ఘనిస్థాన్ ను కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు విఫలం అయ్యారు. స్పిన్ బౌలర్లు ధారాళంగా విరాళాలు ఇచ్చారు. హస్మతుల్లా షాహిదీ 48 పరుగులు, రహ్మత్షా 77 పరుగులతో నాటౌట్గా నిలిచారు.
190 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయినా వన్ డౌన్గా వచ్చిన రహ్మత్ షా, హస్మతుల్లా షాహిదీ జట్టు విజయానికి బాటలు వేశారు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 65, ఇబ్రహీం జద్రాన్ 87 పరుగులతో గట్టి పునాదులు వేశారు. ఆఫ్ఘన్ బ్యాటర్లు నిలకడగా రన్ రేట్ కాపాడుకుంటూ.. సింగిల్స్ తీస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి మళ్లిస్తూ.. స్టాండ్స్లోకి పంపుతూ పరుగులు రాబట్టారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ముందు 283 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. చివరి ఓవర్ లో పాక్ ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్ వికెట్లు కోల్పోయింది. అంతకుముందు కెప్టెన్ బాబర్ ఆజం సహా ఐదు వికెట్లు కోల్పోవడంతో చిక్కుల్లో పడ్డ జట్టు పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను షాదాబ్ ఖాన్ 35, ఇఫ్తికార్ అహ్మద్ 32 చేపట్టారు.