ODI World Cup | 33వ ఓవర్ లో హసన్ అలీ వేసిన మూడో బంతిని ఆడిన ఇబ్రహీం జాద్రాన్ బ్యాట్ ఎడ్జ్ కు తాకి కీపర్ మహ్మద్ రిజ్వాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఆప్ఘనిస్థాన్ 190 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అంతకు ముందు 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఒక వికెట్ కోల్పోయి 175 పరుగులు చేసింది. క్రీజ్ లో ఇబ్రహీం జడ్రాన్ 82 పరుగులు, రహ్మత్ షా 22 పరుగులతో కొనసాగుతున్నారు. అంతకుముందు 25 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 152 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ముందు 283 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.