ఢిల్లీ: ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు జూన్లో భారత పర్యటనకు రానుంది. టీమ్ఇండియాతో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ 6-10 మధ్య జరుగబోయే ఏకైక టెస్టుకు చండీగఢ్ ఆతిథ్యమివ్వనుండగా అదే నెల 14 (ధర్మశాల)న తొలి వన్డే, 17(లక్నోలో)న రెండో వన్డే, 20 (చెన్నై)లో మూడో వన్డే జరుగుతుంది. టెస్టులు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగం కాకపోయినా 2027 వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా భారత ఆటగాళ్ల సన్నద్ధతకు ఈ వన్డేలు ఉపయోగపడనున్నాయి.