ODI World Cup | 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ 25 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 152 పరుగులు చేసింది. క్రీజ్ లో ఇబ్రహీం జడ్రాన్ 74 పరుగులు, రహ్మత్ షా ఎనిమిది పరుగులతో క్రీజ్ లో కొనసాగుతున్నారు. అంతకుముందు 20 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘనిస్థాన్ వికెట్ కోల్పోకుండానే 128 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ముందు 283 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.