Virat Kohli Retirement : సొంత గడ్డపై 12 ఏళ్ల తర్వాత జరుగనున్న వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో భారత జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పరుగుల వరద పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఎందుకంటే బహుశా ఇదే అతడికి చివరి వన్డే ప్రపంచకప్ కావొచ్చు. ఈ టోర్నీ తర్వాత కోహ్లీ 50 ఓవర్ల ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించే చాన్స్ ఉంది? అనే వార్తలు చాన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రశ్నకు కోహ్లీ సన్నిహితుడు ఏబీ డివిలియర్స్(AB De Villiers) ఔననే సమాధానం చెప్పాడు.
ప్రపంచకప్ అనంతరం విరాట్ పరిమిత ఓవర్ల క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని, టెస్టుల్లో మాత్రమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఏబీ అభిప్రాయపడ్డాడు. డివిలియర్స్ వ్యాఖ్యలతో కోహ్లీ అభిమానులు షాక్కు గురవుతున్నారు. ‘2027లో వన్డే వరల్డ్కప్ దక్షిణాఫ్రికాలో జరుగనుంది. ఆ టోర్నీలో ఆడాలని విరాట్ అనుకుంటాడు. కానీ, అలా జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే అందుకు ఇంకా చాలా సమయం ఉంది. స్వదేశంలో వన్డే వరల్డ్కప్ తర్వాత…
విరాట్ కోహ్లీ
‘‘అందరికీ ధన్యవాదాలు, నేను ఇక మీదట టెస్టులు, ఐపీఎల్ మాత్రమే ఆడతాను, కుటుంబానికి సమయం కేటాయిస్తాను. అందరికీ గుడ్ బై’’ అని కోహ్లీ ప్రకటిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఫిట్నెస్ ప్రకారం చూస్తే మరో నాలుగైదేండ్లు ఆడటం పెద్ద కష్టం కాదు. అతడు శారీరకంగా మానసికంగా ఎంతో బలంగా ఉంటాడు. ఆటపట్ల అతడికి ఉన్న అంకిత భావం చాలా గొప్పది. అతడు ఎప్పుడూ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడడు. టీమ్కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అన్ని ఫార్మాట్లలో విజయాలను కొనసాగించాలని అహర్నిశలు తపిస్తుంటాడు.
డివిలియర్స్, విరాట్ కోహ్లీ
అందుకే మైదానంలో కోహ్లీ ఎల్లప్పుడూ చాలా జోష్లో కనిపిస్తాడు’ అని డివిలియర్స్ తన యూట్యూబ్ చానల్లో వెల్లడించాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) తరఫున కోహ్లీ, డివిలియర్స్ సుదీర్ఘ కాలం కలసి ఆడారు. అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉంది. అయితే.. 16వ సీజన్కు ముందే ఈ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఐపీఎల్కు గుడ్ బై చెప్పేశాడు.