World Cup 2023 | స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్లో టీమిండియా సత్తాచాటాలంటే ఆ ప్లేయర్ తప్పక రాణించాలని డివిలియర్స్ అన్నాడు. పుష్కర కాలం తర్వాత భారత జట్టు సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడనుండగా.. ఇప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు ఎవరికి తోచినట్లు వాళ్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. సొంతగడ్డపై టీమ్ఇండియాకు తిరుగు లేదని ఒకరు అంటుంటే.. ఈ సారి భారత్ అంత బలంగా లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు వన్డే చాంపియన్గా అవతరించాలంటే.. ఆ ప్లేయర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు.
‘2023 వన్డే వరల్డ్కప్లో భారత్ విజయం సాధించాలంటే.. కోహ్లీ ఏం చేయగలడో.. అది చేసి చూపించాలి’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున సుదీర్ఘ కాలం కోహ్లీతో కలిసి ఆడిన డివిలియర్స్.. అతడి ప్రతిభపై తనకు అపార నమ్మకముందని గతంలోనూ పలుమార్లు వెల్లడించాడు. వీరిద్దరి మధ్య సోదర ప్రేమ ఎప్పటి నుంచో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Read More : Funny Run Out | అందుకే ఫిట్నెస్ ముఖ్యమనేది.. విండీస్ మహాబలుడి ఫన్నీ రనౌట్
స్వదేశంలో మెగాటోర్నీ జరగనుండటం భారత్కు కలిసొచ్చే అంశం కాగా.. పరుగుల యంత్రం, చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే టీమిండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ ముద్దాడుతుందని ఏబీడీ అభిప్రాయపడ్డాడు. ఇక నేటితో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి పదిహేనేండ్లు పూర్తి చేసుకున్న కోహ్లీ.. తన అరంగేట్రం తర్వాత వన్డే క్రికెట్లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. లెక్కకు మిక్కిలి రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.