Aaron Finch : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) ఎల్లుండి మొదల్వనుంది. ఈ మెగా ఫైట్లో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉండనుంది? అనే దానిపై మాజీ మాజీ క్రికెటర్లు నోరు విప్పుతున్నారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్(Aaron Finch) సంచలన కామెంట్ చేశాడు. ఫైనల్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బంతితో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అన్నాడు.
అంతేకాదు అతడి బదులు సీనియర్ రవిచంద్రన్ అశ్విన్ను ఆడించాలని అభిప్రాయపడ్డాడు. తన ఒపీనియన్కు కారణం కూడా చెప్పుకొచ్చాడు. ‘ఆట సాగే కొద్దీ ఓవల్ పిచ్పై పగుళ్లు వస్తాయి. దాంతో, మిడిల్ ఆఫ్ ది వికెట్ బౌలింగ్ చేసే జడేజా పెద్దగా ప్రభావం చూపలేడు. అతడి స్థానంలో అశ్విన్ను ఆడిస్తే మంచిది. ఎందుకంటే..? అతడు వికెట్లు తీస్తాడు’ అని వెల్లడించాడు.
ఆరోన్ ఫించ్
అయితే.. ఆరో స్థానంలో జడ్డూ ధాటిగా బ్యాటింగ్ చేయగలడు. అందుకని అశ్విన్ ఇక బెంచ్కే పరిమితమవుతాడనేది మరికొందరి వాదన. ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెటోరీ కూడా జడేజాకే ఓటేశాడు. ఈసారి అశ్విన్ డబ్ల్యూటీసీ ఫైనల్ మిస్ అవుతాడని అతను ఇంతకుముందే చెప్పాడు. జూన్ 7న ఓవల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలయా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
ఈ ఏడాది ప్రారంభంలో మోకాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత జడేజా మునపటి లయ అందుకున్నాడు. రంజీ మ్యాచ్లో 7 వికెట్లతో సత్తా చాటి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో 25 వికెట్లు తీసి తానెంత విలువైన ఆటగాడినో చాటాడు. ఆ తర్వాత ఐపీఎల్లోనూ రాణించాడు. ఫైనల్లో ఆఖరి రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ బాది చెన్నైని గెలిపించాడు.