హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయ మాస్టర్స్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భార్యాభర్తలు పీకే నూకరాజు, మల్లీశ్వరి సత్తాచాటారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన టోర్నీలో వీరిద్దరు స్వర్ణ పతకాలతో మెరిశారు.
మల్లీశ్వరి 64 కిలోల విభాగంలో బరిలోకి దిగిన మల్లేశ్వరి స్నాచ్లో 40 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 55 కిలోలు ఎత్తి మొత్తంగా 95 కిలోలతో పసిడి సొంతం చేసుకుంది. 67 కిలోల విభాగంలో నూకరాజు మొత్తం 155 కిలోలతో టాప్లో నిలిచాడు.