వయసు ఒక సంఖ్య మాత్రమే.. మనలో పట్టుదల ఉండాలేకానీ ఏ వయసులో అయినా మనం అనుకున్నది సాధించవచ్చు. ఈ మాటలను నిజం చేసింది భగవానీ దేవీ దాగర్ అనే 94 ఏళ్ల బామ్మ. ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్-2022లో భారత్ తరఫున పోటీ పడిన ఆమె.. 100 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించింది.
ఫిన్ల్యాండ్ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో.. 100 మీటర్ల రేస్ను కేవలం 24.74 సెకన్లలో పూర్తిచేసిన భగవానీ.. గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. అలాగే షార్ట్ పుట్లో కూడా పోటీ పడి రెండు కాంస్య పతకాలు తన ఖాతాలో వేసుకుంది.
94-year-old Bhagwani Devi Dagar won a gold and 2 bronze for India at the World Masters Athletics championships 2022 in Finland, yesterday pic.twitter.com/JRPZrBDSAK
— ANI (@ANI) July 11, 2022