న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్లు విధిగా ఐదు రోజులు క్వారంటైన్లో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈనెల 17 నుంచి ఈ టోర్నీ తొలి దశ ప్రారంభం కానుండడంతో బీసీసీఐ మంగళవారం అన్నీ రాష్ర్టాల బోర్డులకు కరోనా మార్గదర్శకాలు జారీచేసింది. కరోనా నేపథ్యంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించింది. ఆటగాళ్లు, సహాయ సిబ్బందితో కలిపి జట్టు సభ్యుల సంఖ్య 30 మందిని మించకూడదన్న బోర్డు.. ప్రతి జట్టు ఒక ఫిజిషియన్ను నియమించుకోవాలని పేర్కొంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ సౌరాష్ట్ర, ముంబై తలపడనున్నాయి.
బీసీసీఐ మార్గదర్శకాలు..