చరిత్ర తెలియనిదే భవిష్యత్తును తీర్దిదిద్దలేం!
గతాన్ని గుర్తిస్తేనే వర్తమానానికి మెరుగులు అద్దగలం!!
నాలుగు పుష్కరాల క్రితం ప్రారంభమైన ప్రపంచకప్ ప్రస్థానం దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ 13వ ఎడిషన్కు చేరుకుంది. ప్రతి టోర్నీకి నిబంధనలు మారుతూ తెల్ల దుస్తూల నుంచి కలర్ఫుల్ డ్రస్సుల్లోకి 60 ఓవర్ల నుంచి 50 ఓవర్ల ఫార్మాట్కు మారిన ఈ మెగాటోర్నీ ఆరంభంలో కరీబియన్లను కొట్టేవాళ్లు లేకపోయే వారనడంలో అతిశయోక్తి లేదు. 1975లో ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగాప్రవేశపెట్టిన వరల్డ్కప్లో విజేతగా నిలిచిన వెస్టిండీస్.. ఆ తర్వాత వరుసగా మరో రెండుసార్లు ఫైనల్కు చేరింది. భీకరమైన పేస్ దళం.. బీభత్సమైన బ్యాటింగ్ బలం ఉన్నకరీబియన్ల ఘన ప్రస్థానంపై ఓ కన్నేద్దాం..
ఏదైనా బృహత్కార్యం తలపెట్టే ముందు దానికి సంబంధించిన సుక్ష్మాతి సుక్ష్మమైన విషయాలపై కూడా దృష్టిసారించడం ఆనవాయితీ! పూర్వాపరాలను పరిశీలించి.. మంచి, చెడులను విశ్లేషించుకున్నాకే అడుగు ముందుకు వేయడం పరిపాటి!!
మరి నాలుగేండ్లకోసారి జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్నకు కూడా ఇలాంటి సంప్రదాయం తప్పుదుగా! వచ్చే నెల 5 నుంచి స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. దానికి ముందు ఇప్పటి వరకు జరిగిన 12 ప్రపంచకప్ల విజేతల గురించి ఈ రోజు నుంచి క్లుప్తంగా తెలుసుకుందాం!
Cricket World cup | శతాబ్దాల ఘన చరిత్ర ఉన్న క్రికెట్లో తొలిసారి వన్డే ప్రపంచకప్ నిర్వహించాలనుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆటకు పుట్టినిైల్లెన ఇంగ్లండ్ను వేదికగా నిర్ణయించింది. 1975లో ఆతిథ్య ఇంగ్లండ్తో టీమ్ఇండియా తలపడిన మ్యాచ్తో మొదటి ప్రపంచకప్నకు తెరలేవగా.. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన వెస్టిండీస్ జట్టు ఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తుచేసిన వెస్టిండీస్ అంచనాలకు తగ్గట్లు తుదిపోరుకు అర్హత సాధిస్తే.. మరో సెమీస్లో ఇంగ్లండ్పై నెగ్గిన విండీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. ైక్లెవ్ లాయిడ్ సారథ్యంలోని వెస్టిండీస్ను ఓడించడం శక్తికి మించిన పనే అని అప్పటికే మిగిలిన జట్లన్నీటికి బోధపడగా.. ఫైనల్లో కరీబియన్లు పూర్తి ఆధిపత్యం కనబర్చారు.
కెప్టెన్ లాయిడ్ (85 బంతుల్లో 102; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు సెంచరీతో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 60 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేస్తే.. లక్ష్యఛేదనలో ఆసీస్ 58.4 ఓవర్లలో 274 రన్స్కు ఆలౌటైంది. కెప్టెన్ ఇయాన్ చాపెల్ (62) ఒంటరి పోరాటం జట్టును గట్టెక్కించలేకపోయింది. కంగారూ జట్టులో ఐదుగురు ప్లేయర్లు రనౌట్ కావడం గమనార్హం. అప్పటికే ద్వైపాక్షిక సిరీస్ల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ.. ప్రత్యర్థిని కోలుకోనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసే జట్టుగా పేరు తెచ్చుకున్న విండీస్ తొలిసారి లార్డ్స్ గ్యాలరీలో ప్రపంచకప్ను ముద్దాడింది. ఇక అక్కడి నుంచి ప్రతి నాలుగేండ్లకోసారి ప్రపంచకప్ నిర్వహించడం పరిపాటిగా మారింది. మొదట్లో దీన్ని ప్రుడెన్షియల్ కప్ అని నామకరణం చేయగా.. కాలనుగుణంగా దాని పేరు మారుతూ వన్డే ప్రపంచకప్గా రూపాంతరం చెందింది.
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ట్రోఫీ హైదరాబాద్లో సందడి చేసింది. రెండు రోజుల టూర్లో భాగంగా గురువారం ఉదయం చారిత్రక కట్టడం చార్మినార్ ముందు కప్పును ప్రదర్శనకు ఉంచారు. ఆ తర్వాత హుస్సేన్ సాగర్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రోఫీని ప్రదర్శించగా.. అభిమానులు పొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం ఉప్పల్ స్టేడియంలో రెనోవేషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అభిమానులకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని సుప్రీంకోర్టు నియమించిన ఏక సభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ లావు నాగేశ్వరరావు వెల్లడించారు. సౌత్ స్టాండ్లో ధ్వంసమైన కనోపి (పైకప్పు) పనులు పూర్తయ్యాయని మాజీ ఐపీఎస్ అధికారి కోడె దుర్గాప్రసాద్ గురువారం వెల్లడించారు.