IPL 2024 : ఐపీఎల్ 17 వ సీజన్లో మరో ఇద్దరు కొత్త ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తున్నారు. గాయపడిన స్టార్ స్పిన్నర ముజీబ్ రెహ్మాన్ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఫ్రాంఛైజీ యువ స్పిన్నర్ను తీసుకుంది. అఫ్గనిస్థాన్కే చెందిన 16 ఏండ్ల అల్లాహ్ ఘజన్ఫర్(Allah Ghajanfar)తో కోల్కతా ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా గాయంతో టోర్నీకి దూరమైన ప్రసిధ్ కృష్ణ స్థానంలో సఫారీ స్పిన్నర్ కేశవ్ మహారాజ్(Keshav Maharaj)ను తీసుకుంది.
అండర్ -19 వరల్డ్ కప్లో ఘజన్ఫర్ అదరగొట్టాడు. న్యూజిలాండ్పై తన స్పిన్ మాయాజాలంతో 29 రన్స్కే 3 వికెట్లు తీశాడు. అఫ్గనిస్థాన్ తరఫున రెండు వన్డేలు ఆడాడంతే. ఈ మిస్టరీ స్పిన్నర్కు కోల్కతా రూ.20 లక్షలు చెల్లించనుంది. ఐపీఎల్ ఆడిన అతిచిన్నఘజన్ఫర్ వయస్కుడిగా చరిత్ర సృష్టిస్తాడు.
🚨 Squad Update – Allah Ghazanfar joins the squad to replace Mujeeb Ur Rahman.
Welcome to the Galaxy of Knights! 🤝 pic.twitter.com/E83MmSakEG
— KolkataKnightRiders (@KKRiders) March 28, 2024
ఈ సీజన్లో దక్షిణాఫ్రికా పేసర్ క్వెనా మఫాకా 17 ఏండ్ల వయసులో అరంగేట్రం చేశాడు. ఇక భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్లో మహరాజ్ 14 వికెట్లతో సత్తా చాటాడు. దాంతో, ఈ ఫింగర్ స్పిన్నర్కు రాజస్థాన్ రూ.50 లక్షలు ముట్టజెప్పనుంది. ఈ ఇద్దరూ త్వరలోనే తమ జట్లతో కలువనున్నారు.