Sachin Pilot | హిమాచల్ప్రదేశ్ లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే వ్యాఖ్యలపై రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ స్పందించారు. ‘ఒకవేళ కొందరు కొన్ని తప్పు అంశాలు మాట్లాడవచ్చు. దాన్ని మేం ఎప్పుడూ సమర్థించం. అన్ పార్లమెంటరీ భాష వాడొద్దు. వ్యక్తిత్వ హననం సరైన చర్య కాదు. అంశాల వారీగా రాజకీయాలు ఉండాలి’ అని గురువారం ఎన్డీటీవీ నిర్వహించిన యువ కాంక్లేవ్లో సచిన్ పైలట్ స్పష్టం చేశారు.
‘సార్వత్రిక ఎన్నికల్లో మేం అంశాలపైనే ఫోకస్ చేస్తాం. సాధారణ ప్రజల రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే అంశాలను మాత్రమే ప్రచారాస్త్రాలుగా వాడతాం’ అని సచిన్ పైలట్ చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కంగనారనౌత్ పోటీ చేస్తుండటంతో ఆమెకు వ్యతిరేకంగా సుప్రియా శ్రీనాథే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అభ్యంతరకరమైన పోస్ట్ వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్.. సుప్రియా శ్రీనాథేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుప్రియా శ్రీనాథేపై కంగనా రనౌత్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతి సాధారన మహిళ గౌరవాన్ని కాపాడే పాత్రలను సినిమాల్లో నటించానని గుర్తు చేశారు.