హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో నిఖత్ జరీన్ స్వర్ణం నెగ్గడం రాష్ర్టానికి, దేశానికి గర్వకారణమని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జరీన్ భవిష్యత్ లక్ష్యాలకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
మెగాటోర్నీలో జరీన్ (52 కిలోలు) స్వర్ణ పతకం సాధించిన సందర్భంగా ఆమె తండ్రి జమీల్ అహ్మద్ను శనివారం మంత్రి ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీజీవో కేంద్ర సంఘం ప్రతినిధులు రవీందర్ కుమార్, సహదేవ్, వెంకట్, హరికృష్ణ, వెంకటయ్య పాల్గొన్నారు.