Pro Kabaddi League | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణేరీ పల్టన్, హర్యానా స్టీలర్స్ ఫైనల్కు దూసుకెళ్లాయి. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో పుణెరి పల్టన్ 37-21తో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరెట్స్పై విజయం సాధించింది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన పుణెరి.. సెమీస్లోనూ అదే జోరు కనబర్చింది. రెండో సెమీఫైనల్లో హర్యానా స్టీలర్స్ 31-27తో జైపూర్ పింక్ పాంథర్స్పై గెలుపొందింది. శుక్రవారం జరగనున్న తుదిపోరులో పుణెరీతో హర్యానా స్టీలర్స్ తలపడనుంది.