హవేళిఘనపూర్, మే 27: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్, గ్రామ సర్పంచ్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని లింగ్సాన్పల్లి గ్రామంలో సర్పంచ్ మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చే యించుకున్నట్లయితే వారికి ఉచితంగా మందులను అందజేస్తామన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారికి సర్పంచ్ మహిపాల్రెడ్డి మం దుల కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం బీబీ, దుర్గ, అంగన్వాడీ కవిత, ఆశ వర్కర్ శోభ ఉన్నారు.
కరోనా కట్టడికి ఆరోగ్య సర్వే
మెదక్రూరల్ మే27: ప్రభుత్వం కరోనా కట్టడికి ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నదని సర్పంచ్ కళావతి అన్నారు. గురువారం మెదక్ మండలంలోని మగ్థుమ్పూర్ గ్రామంలో సర్పంచ్ కళావతి, వైద్య, పంచాయతీ ,అంగన్వాడీ సిబ్బంది ఇంటింటా రెండో విడుత జర్వ సర్వేలో పాల్గొని ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారిని గుర్తించి కరోనా కిట్టు అందజేస్తామన్నారు. వారిని హోం క్వా రంటైన్లో ఉండాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది రమేశ్ , పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు, టీఆర్ఎస్ నాయకులు అరవింద్ ఉన్నారు.