చెన్నారావుపేట, జూన్ 4: ఇటీవల జల్లి గ్రామ సర్పంచ్ అంబాల సుధాకర్ మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులను శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులు పరామర్శించారు. ఈ సందర్భంగా రూ. 1.15 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య రూ. 75 వేలు, మాజీ ఎంపీపీ జక్క అశోక్ రూ. 25 వేలు, ఎంపీడీవో లలిత, ఎంపీవో సురేశ్, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది కలిసి రూ. 10 వేలు, మిషన్ భగీరథ ఏఈ మంగీలాల్ రూ. 5 వేలు మొత్తం రూ. 1.15 లక్షల ఆర్థిక సాయాన్ని మృతుడి కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల కార్యదర్శి అనుముల కుమారస్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి, లింగగిరి సర్పంచ్ మాదారపు భాస్కర్, శంకరంతండా సర్పంచ్ భూక్యా భద్రు, కోనాపురం సర్పంచ్ వెల్దె సుజాత-సారంగం, ఉప్పరపల్లి సర్పంచ్ అనుమాండ్ల శ్రీధర్రెడ్డి, ఏడీఏ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శి కుటుంబానికి..
సంగెం: పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ పంచాయతీ కార్యదర్శి పనికర కిశోర్కుమార్ ఇటీవల కరోనాతో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి గవిచర్ల సర్పంచ్ దొనికెల రమ-శ్రీనివాస్ రూ. వెయ్యి ఆర్థిక సాయం అందజేశారు.