ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల, ఏప్రిల్ 23 : రైతు కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. శుక్రవారం మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలో అనారోగ్యంతో రైతు కావలి కృష్ణ మరణించగా వారి కుటుంబానికి మంజూరైన రూ.5లక్షల రైతు బీమా చెక్కును కృష్ణ భార్య శివమ్మకు జెడ్పీ చైర్పర్సన్ సరితతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు వివిధ కారణాలతో మరణిస్తే వారి కుటుంబాలకు చేయూత నివ్వాలనే ఉద్ధేశంతో గుంట పొలం ఉన్న రైతుకు కూడా ప్రభుత్వం రైతుబీమా వర్తింపజేస్తుందన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధరూర్ మండలం నెట్టెంపాడ్ గ్రామానికి చెందిన మహాదేవ మ్మ అనారోగ్యానికి గురి కాగా ఆమె చికిత్స నిమిత్తం మంజూరైన రూ.17వేల ఎల్వోసీని ఎమ్మెల్యే వారి కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ రాజారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీ గోపాల్రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, తిమ్మారెడ్డి, మహేశ్, రాధాకృష్ణారెడ్డి, కేటీదొడ్డి వైస్ ఎంపీపీ రామకృష్ణ, నాయకులు భీంరెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
రైతు శ్రేయస్సే ధ్యేయం
గద్వాల రూరల్, ఏప్రిల్ 23 : రైతు శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. మండలంలోని బీరెల్లి, లత్తిపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడతూ ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించి దళారి వ్యవస్థను దూరం చేసిందన్నారు. ప్రతి గ్రామంలో కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేసి రవాణా తిప్పలు తగ్గించిందన్నారు. ప్రభుత్వానికి రైతులు సహకారం అందించి ప్రతి రైతు మాస్కు ధరించి కరోనాను ధరి చేరకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ సరోజమ్మ, అదనపు కలెక్టర్ రఘురామశర్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ ప్రతాప్గౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్ నాయుడు, నాయకులు సత్యారెడ్డి, నీలేశ్వర్రెడ్డి, రాజారెడ్డి, బీచుపల్లి, శ్రీరాములు, సర్పంచులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.