ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ జియోమీ నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ త్వరలో భారత్లో లాంచ్ కాబోతోంది. 11టీ సిరీస్లో భాగంగా.. జియోమీ 11టీ, జియోమీ 11టీ ప్రో, రెడ్మీ 10(2022) మోడల్ ఫోన్లను జియోమీ లాంచ్ చేయనుంది. వాటితో పాటు.. రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో, రెడ్మీ వాచ్ 2, రెడ్మీ వాచ్ 2 లైట్, జియోమీ వాచ్ ఎస్1 యాక్టివ్ను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
అయితే.. భారత మార్కెట్లో ఈ మోడల్ ఫోన్లను జియోమీ ఎప్పుడు లాంచ్ చేస్తుందో తెలియనప్పటికీ.. వాటి స్పెసిఫికేషన్లు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జియోమీ 11టీ.. 8 జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్లలో లభ్యం అవుతుంది. 11 టీ ప్రో కూడా 8 జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 256 జీబీ, 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్లలో లభ్యం కానుంది. మూడు కలర్లలో ఈ ఫోన్లు లభిస్తాయి.
రెడ్మీ 10 మోడల్ ఫోన్ కూడా 4 జీబీ ప్లస్ 64 జీబీ, 4 జీబీ ప్లస్ 128 జీబీ, 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్లను ఒకేసారి కాకుండా.. జియోమీ దశలవారీగా విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Password | మీ పాస్వర్డ్ హ్యాకర్లకు తెలిసిపోయిందని అనుమానమా? ఇలా చెక్ చేసుకోండి..
Xiaomi : డిసెంబర్ 16న షియామి 12, షియామి 12X లాంఛ్
Whatsapp | రెండు కీలకమైన సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకొచ్చిన వాట్సాప్
Amazon Prime : డిసెంబర్ 13 లోపే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి.. లేదంటే?