G-Pay | ప్రస్తుతం భారత్లో రోజువారీగా గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, భారత్ పే వంటి యాప్స్ సాయంతో ఆన్లైన్ పేమెంట్స్ జరుపుతున్నాం. కానీ ఇప్పుడు `జీ-పే ( GPay) తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్పేస్ (యూపీఐ) పేమెంట్స్ వినియోగంలోకి వచ్చిన కొత్తలో గూగుల్.. తన జీ-పేను అందుబాటులోకి తెచ్చింది.
ప్రారంభంలో పాపులారిటీ కోసం ఆన్లైన్ పేమెంట్స్ చేసిన వారికి క్యాష్బ్యాక్ ఆఫర్లు ఇచ్చిన జీ-పే ఇప్పుడు విభిన్న డీల్స్పై డిస్కౌంట్లు ఇస్తున్నది. జీ-పే ద్వారా చేసే చెల్లింపులపై యూజర్లు రివార్డు పాయింట్లు పొందుతున్నారు. యూజర్లు తమ మొబైల్ రీచార్జీ, డీటీహెచ్ రీచార్జీ, ఎలక్ట్రిక్ బిల్లులు ఈ యాప్ ద్వారా పే చేయొచ్చు.
ప్రారంభంలో క్యాష్బ్యాక్ ఆఫర్లు ఇచ్చిన జీ-పే.. ఇప్పుడు రివార్డు పాయింట్లు మాత్రమే ఇస్తున్నది. విభిన్న బ్రాండ్లపై ఆన్లైన్ పేమెంట్స్ జరిపితే క్యాష్బ్యాక్కు బదులు రివార్డు పాయింట్లు లభిస్తున్నాయి. ఇలా క్యాష్బ్యాక్కు బదులు రివార్డు పాయింట్లు ఇవ్వడం పట్ల యూజర్లు మండిపడుతున్నారు.
దీంతో ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతున్నది. ఇది యూజ్లెస్ యాప్ ( Use less App ) అని ట్వీట్లు చేస్తున్నారు. క్యాష్బ్యాక్కు బదులు యూజ్లెస్ రివార్డు పాయింట్లు ఇస్తున్నదని మండిపడుతున్నారు. క్యాష్బ్యాక్కు బదులు డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా గూగుల్ తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తున్నదని పేర్కొంటున్నారు.
`యూజ్లెస్ ఓచర్లు రివార్డు చేయడంలో జీ-పే @ గూగుల్ పే ఇండియా అసాధారణ కృషి చేస్తున్నది. ఇది గాయాలపై కారం చల్లినట్లు ఉంటుంది. ఈ యాప్ ఉపయోగమా.. లేదా? అని అడుగుతున్నారు యూజర్లు. జీ-పేపై రివార్డ్ లేదా క్యాష్ బ్యాక్ పొందడం ఒక పురాణగాథగా మారిందని మరో యూజర్ సెటైర్ వేశారు. యూజ్లెస్ పేమెంట్స్ యాప్స్లో జీ-పే ఒకటి. జీ-పే జోక్స్ మాత్రమే రివార్డ్ చేస్తుందని ఇంకొక యూజర్ పేర్కొన్నాడు.
2017లో తేజ్ గూగుల్ (GPay) పేరుతో ఆన్లైన్ పేమెంట్స్ సేవలు ప్రారంభించింది. 2018 ఆగస్టులో జీ-పేగా రూపాంతరం చెందింది. మొబైల్ రీచార్జీ, డీటీహెచ్ రీచార్జితోపాటు అన్ని రకాల ఆన్లైన్ పేమెంట్లపై క్యాష్బ్యాక్ ఆఫర్లు ఇచ్చి భారత్లో ప్రముఖ యూపీఐ యాప్గా జీ-పే గుర్తింపు సంపాదించుకున్నది.