RAT hack | ప్రజల్లో అవగాహన పెరిగేకొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇప్పటిదాకా స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి టీమ్వ్యూయర్, ఎనీడెస్క్, క్విక్ సపోర్టు యాప్లను డౌన్లోడ్ చేయించి.. యూపీఐ ఐడీ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ఆర్థికలావాదేవీలు జరిపించి బ్యాంక్ఖాతాలను కొల్లగొట్టేవా రు. పోలీసులు ఇలాంటినేరాలపై ప్రజలను అప్రమత్తం చేయడంతో.. సరికొత్తగా రిమోట్ యాక్సెసింగ్ టూల్ (ఆర్ఏటీ-ర్యాట్) ద్వారా ఓ లింక్ను పంపిస్తున్నారు. దానిని క్లిక్చేసేలా మాటలతో బోల్తా కొట్టించి ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్నారు.
రిమోట్ యాక్సెసింగ్ టూల్ ద్వారా లింక్ను తయారుచేస్తున్న సైబర్ మోసగాళ్లు దానిని బల్క్ ఎస్సెమ్మెస్ రూపంలో మొబైల్స్కు పంపిస్తున్నారు. ఎస్బీఐ నుంచి పంపుతున్నట్టుగా చెప్తూ.. కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే మీ ఖాతా మరో ఆరు గంటల్లో మూసివేయబడుతుందంటూ హెచ్చరిస్తారు. తర్వాత స్వయంగా ఫోన్లుచేసి ఇటీవల మీరు జరిపిన లావాదేవీలకు కేవైసీ అప్లోడ్ లేకపోతే మీ ఖాతాల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నిఘా ఉంటుందంటూ భయపెడతారు. వారు చెప్పినట్టు లింక్పై కిక్చేస్తే ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను తలపించేలా పేజీ కనపడుతుంది. అందులో వివరాలను ఎంట్రీ చేయించి.. తర్వాత ఆన్లైన్ ద్వారా చిన్న ఆర్థిక లావాదేవీ జరిపిస్తారు. ఈ సమయంలోనే మన వివరాలన్నింటినీ వారు తమ స్క్రీన్పై చూసుకుని.. తాపీగా ఖాతాలను ఖాళీ చేస్తారు.
సైబర్ మాయగాళ్లు రిమోట్ యాప్ల స్థానంలో ఇప్పుడు ర్యాట్ ద్వారా లింక్లను రూపొందిస్తున్నారు. ఈ టూల్ ద్వారా మీరు నొక్కే ప్రతి బటన్ దృశ్యాన్ని సైబర్ నేరగాళ్లు ప్రత్యక్షంగా వీక్షించేలా వీలుంటుంది. దీనిపై ఇటీవల 10 ఫిర్యాదులు అందాయి. వాటిని విశ్లేషించి.. విచారించగా ఈ విషయం బయటపడింది. ఈ సైబర్ నేరగాళ్లు జార్ఖండ్ జామ్తారా, పశ్చిమబెంగాల్ ప్రాంతాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నాం. కేవైసీని ఆన్లైన్లో అప్డేట్ చేయాలంటూ ఏ బ్యాంక్ అడుగదు. మీ ఖాతాలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా బ్యాంక్ అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలి.
– వెంకటేశ్, ఇన్స్పెక్టర్ రాచకొండ సైబర్ క్రైం పీఎస్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గూగుల్లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
గూగుల్లో ఫేక్ ఫోటోలను ఎలా గుర్తించాలి…?
whatsapp hacks |వాట్సాప్ను ఇలా హ్యాకింగ్ చేస్తున్నారు.. జాగ్రత్త