న్యూఢిల్లీ : చాట్జీపీటీ (ChatGpt), బింగ్, బార్డ్ వంటి ఏఐ చాట్బాట్లకు ఆదరణ పెరిగిన క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై టెక్ ప్రపంచంలో గత కొంతకాలంగా హాట్ డిబేట్ సాగుతోంది. ఏఐ రాబోయే రోజుల్లో ఉద్యోగాలకు ఎసరు పెడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్తో కొలువుల కోత తప్పదనే ఆందోళన వెల్లడవుతుండగా టీసీఎస్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ న్యూ టెక్నాలజీపై బాంబు పేల్చారు.
టెక్ రంగంలో ఏఐ అంతరాయం కలిగిస్తుందని, భవిష్యత్లో ఇది జాబ్ మార్కెట్పై ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. చాట్జీపీటీ గురించి మనం ఇప్పుడు ఎక్కడచూసినా మాట్లాడుతున్నాం..ఇది ఉత్పాదకతను పెంచుతుంది..అయితే భవిష్యత్లో ఏఐతో కొలువులు, నైపుణ్యాలపై ప్రభావం ఉంటుందని అన్నారు. దీనిపై మనం నియంత్రిత యంత్రాంగంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
తమ కంపెనీలో ఏఐ టెక్నాలజీ వాడకంపై చంద్రశేఖరన్ స్పందిస్తూ చాట్జీపీటీ ద్వారా అన్ని సిస్టమ్లను రూపొందించే చిన్న కంపెనీపై తాము కసరత్తు సాగిస్తున్నామని తెలిపారు. ఓ చిన్న కంపెనీపై ఈ దిశగా తాము పైలట్ ప్రాజెక్టు చేపట్టామని చెప్పారు. అత్యంత నైపుణ్యాలు కలిగి మార్పునకు అనుగుణంగా రూపాంతరం చెందగలిగే వెసులుబాటు కలిగిన బృందం తమకున్నదని తెలిపారు.
Read More