న్యూఢిల్లీ : టీసీఎస్ (TCS) ఉద్యోగులకు కంపెనీ తీపికబురు అందించింది. వేతన అసమానతలు తగ్గించడంతో పాటు ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేసేందుకు టీసీఎస్ కసరత్తు సాగిస్తోంది. ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకునే అవకాశం కల్పిస్తున్నామని, ఆపై వారి వేతనాలు రెట్టింపు అవుతాయని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లకాడ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పలు టెక్ కంపెనీలు మనుగడ కోసం మాస్ లేఆఫ్స్కు తెగబడుతున్న క్రమంలో టీసీఎస్ ఫ్రెషర్స్ను హైర్ చేయడంతో పాటు వేతన అసమానతలను తొలగిస్తుండటం పరిశ్రమలో సానుకూల సంకేతాలు పంపుతోంది. రాబోయే రెండేండ్లలో అత్యధిక, అతితక్కువ వేతనాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తామని లకాడ్ చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్లో ఆరులక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా వీరంతా కెరీర్లో వృద్ధి సాధించేందుకు కంపెనీ అవకాశాలు ఇస్తోంది.
భారీ హైక్స్తో ఫ్రెషర్స్ను నియమించుకునే బదులు ఉన్న ఉద్యోగులకు మెరుగైన వేతనం అందించాలనే కసరత్తు సాగిస్తోంది. ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇన్హౌస్ ప్రోగ్రామ్స్ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. టీసీఎస్ ఉద్యోగులకు అందించే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పూర్తిచేసే ఉద్యోగుల వేతనాలను కంపెనీ రెట్టింపు చేస్తుంది. ఈ కార్యక్రమానికి 0-12 ఏండ్ల అనుభవం ఉన్న నాలుగు లక్షల మంది ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇక జూనియర్ లెవెల్స్లోని ఫ్రెషర్స్ వేతనాలనూ పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నామని లకాడ్ తెలిపారు.
Read More