న్యూయార్క్ : చాట్జీపీటీ, బార్డ్ వంటి ఏఐ టూల్స్తో ప్రోగ్రామింగ్ ఎక్కువమందికి చేరువవుతుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలు కోల్పోతామా అనే ప్రశ్నకు పిచాయ్ స్పందిస్తూ ఏ టెక్నాలజీనైనా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఏఐని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని, ఈ దిశగా నిర్ధిష్ట రంగాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. న్యూయార్క్ టైమ్స్ పాడ్కాస్ట్ సందర్భంగా పిచాయ్ ఏఐ టూల్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ టూల్స్తో ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే ఆందోళన అటుంచితే చాట్జీపీటీ, బార్డ్ వంటి ఏఐ టూల్స్ ప్రయోజనాలను ఆయన వివరించారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేపట్టే ప్రోగ్రామింగ్ ప్రక్రియ ఏఐ టూల్స్తో మరింత మెరుగవుతుందని, రాబోయే రోజుల్లో ప్రోగ్రామింగ్ సరళంగా మారుతుందని చెప్పుకొచ్చారు. ఏఐ టూల్స్తో ప్రోగ్రామింగ్ విస్తృతి పెరుగుతుందని అంచనా వేశారు. ఇది కొత్త విషయాలను సృష్టించే క్రమంలో నూతన ఉపాధి అవకాశాలు ముందుకొస్తాయని చెప్పుకొచ్చారు. ఇక సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇప్పటివరకూ బార్డ్ను ఇతర దేశాల్లో ప్రవేశపెట్టలేదు. బార్డ్ కేవలం కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో పరిమిత యూజర్లకే టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంది.
Read More