న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో పెను విధ్వంసం తప్పదనే హెచ్చరికల నడుమ కొలువుల కోతా తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐ టూల్ చాట్జీపీటీకి విశేష ఆదరణ లభిస్తుండటంతో న్యూ టెక్నాలజీతో రాబోయే రోజుల్లో పలు ఉద్యోగాలు కనుమరుగవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ చాట్బాట్ సామర్ధ్యాలు పెరుగుతున్న కొద్దీ మానవ ఉద్యోగాలు అదే స్ధాయిలో కోల్పోతామని చెబుతున్నారు.
రాబోయే ఐదేండ్లలో ఇక మానవ ప్రోగ్రామర్లు ఉండరని, వీరి కొలువులను ఏఐ రీప్లేస్ చేస్తుందని స్టెబిలిటీ ఏఐ సీఈవో ఎమాడ్ మోస్టాక్ బాంబు పేల్చారు. వచ్చే ఏడాది చివరినాటికి చాట్జీపీటీ ఫోన్లలో అందుబాటులోకి వస్తుందని ఇది రన్ అయ్యేందుకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఉండదని స్పష్టం చేశారు. ఏఐ అత్యంత వేగంతో ఎదుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
గిత్హబ్లో 41 శాతం కోడ్స్ ఏఐ ఆధారితమైనవేనని, రాబోయే ఐదేండ్లలో ప్రోగ్రామర్ల అవసరం ఉండదని స్పష్టం చేశారు. ప్రోగ్రామర్లను ఏఐ రీప్లేస్ చేస్తుందని ఈ ఏడాది మేలో ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువంగ్ కూడా తేల్చిచెప్పారు. రాబోయే రోజుల్లో ఏఐ అన్ని రంగాలను, పరిశ్రమలను టచ్ చేస్తుందని స్పష్టం చేశారు. నూతన టెక్నాలజీతో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని అన్నారు.
Read More :
Amazon Prime Day sale | అమెజాన్ ప్రైమ్ డే సేల్ : అందుబాటులోకి న్యూ ఫీచర్