ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ సామ్సంగ్ గత నెలలో గెలాక్సీ సిరీస్లో ఏ52ఎస్ 5జీ ఫోన్ను విడుదల చేసింది. విడుదల చేసినప్పుడే మూడు కలర్స్ వేరియంట్లలో ఫోన్ను విడుదల చేసింది. తాజాగా మరో కలర్ వేరియంట్తో మార్కెట్లోకి ఫోన్ను విడుదల చేసింది. మింట్ కలర్ వేరియంట్తో 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.37,999. కేవలం 8 జీబీ కలర్ వేరియంట్లోనే మింట్ కలర్ ఆప్షన్ను అందుబాటులో ఉంటుంది. 6జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.35,999. మింట్ కలర్తో పాటు మరో మూడు కలర్స్ ఆప్షన్లు.. బ్లాక్, పర్పుల్, వైట్.
సామ్సంగ్ గెలాక్సీ ఏ52ఎస్.. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారంగా నడుస్తుంది. 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఏఎంవోఎల్ఈడీ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే, 120 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778 ఎస్వోసీ, 64 ఎంపీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 4500 ఎంఏహెచ్, 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
OnePlus 9RT : హైఎండ్ ఫీచర్లతో వన్ప్లస్ 9ఆర్టీ విడుదల.. ధర ఎంతంటే?
Motorola Moto E40 : బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో మోటరోలా మోటో ఈ40 ఫోన్ విడుదల
Apple iPhone SE 3 : సరికొత్త ఫీచర్లతో రానున్న ఐఫోన్ ఎస్ఈ 3.. ఐఫోన్ 13కు దీటుగా
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?