న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ చార్జింగ్ టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. పది నిమిషాల్లోపు పూర్తి బ్యాటరీ చార్జింగ్ అయ్యేలా 240డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ సపోర్ట్తో రియల్మి జీటీ 3 (Redmi ) స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేయగా దాని ప్రత్యర్ధి షియామి ఇదే టెక్నాలజీపై తన సబ్ బ్రాండ్ రెడ్మి కసరత్తు సాగిస్తోందని వెల్లడించింది. స్మార్ట్ఫోన్ను 5 నిమిషాల్లోపు పూర్తి చార్జ్ అయ్యేలా 300డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ టెక్నాలజీని రెడ్మి ఆవిష్కరించింది.
300డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ను ప్రదర్శించేందుకు మోడిఫైడ్ రెడ్మి నోట్ 12 డిస్కవరీ ఎడిషన్ను కంపెనీ ఎంచుకుంది. ఒరిజినల్ రెడ్మి 12 డిస్కవరీ ఎడిషన్ 210డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 4300ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. చైనా సోషల్ మీడియా యాప్ వీబోపై తన సరికొత్త చార్జింగ్ టెక్నాలజీకి సంబంధించి రెడ్మి ఓ వీడియోను ప్రదర్శించింది. 300డబ్ల్యూ చార్జింగ్ టెక్నాలజీని ప్రదర్శించేందుకు 4100ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కూడిన రెడ్మి నోట్ 12 డిస్కవరి ఎడిషన్ స్మార్ట్ఫోన్ను ఉపయోగించింది.
మోడిఫైడ్ రెడ్మి నోట్ 12 డిస్కవరీ ఎడిషన్ ఫోన్ కేవలం 3 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ చార్జింగ్ అవగా 5 నిమిషాల్లోపే ఫుల్ బ్యాటరీ చార్జింగ్ అయినట్టు వీడియోలో వెల్లడైంది. రెడ్మి ఈ టెక్నాలజీని 120డబ్ల్యూ హైపర్చార్జ్ టెక్నాలజీకి భిన్నమైన 300డబ్ల్యూ ఇమ్మోర్టల్ సెకండ్ చార్జర్గా పేర్కొంది.
Read More :