Poco M4 Pro 5G | జియోమీ సబ్ బ్రాండ్ పోకో నుంచి లేటెస్ట్ స్మార్ట్ఫోన్ త్వరలో భారత్లో లాంచ్ కానుంది. పోకో ఎం4 ప్రో 5జీ ఫోన్ను ఇండియాలో ఫిబ్రవరి 15న లాంచ్ చేయనున్నారు. గత సంవత్సరం నవంబర్లోనే పోకో ఎం4 ప్రో 5జీ ఫోన్ను ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేశారు. చైనాలో గత సంవత్సరం అక్టోబర్లోనే రెడ్మీ నోట్ 11 5జీ పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయింది.
వర్చువల్గా కాకుండా.. ఫిజికల్ ఈవెంట్ ద్వారానే ఈ ఫోన్ను లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. పోకో ఎం4 ప్రో 5జీ ఫోన్ 4 జీబీ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.19,500 ఉండే అవకాశాలు ఉన్నాయి. 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.21,200 గా ఉండనుంది. కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ విడుదల కానుంది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5, 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డాట్ డిస్ప్లే, 90 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ 810 ఎస్వోసీ ప్రాసెసర్, 6 జబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 50 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ప్రో ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది.
Read More :
Realme C35 | 50 ఎంపీ కెమెరాతో రానున్న రియల్మీ సీ35.. లాంచ్ ఎప్పుడంటే?
WhatsApp | సూపర్ ఫీచర్ను తీసుకురాబోతున్న వాట్సప్.. డెస్క్టాప్ వర్షన్ కోసమే.. అదేంటో తెలుసా?