న్యూఢిల్లీ : టెక్ కంపెనీలతో పాటు కార్పొరేట్ దిగ్గజాల్లో మాస్ లేఆఫ్స్ (Layoffs) ట్రెండ్ కొనసాగుతోంది. ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో కొలువుల కోతకు తెరపడటం లేదు. క్లౌడ్ దిగ్గజం ఒరాకిల్ కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ హెల్త్కేర్ రికార్డ్స్ కంపెనీ సెర్నర్లో 3000 మంది ఉద్యోగులపై వేటు వేసిందని సమాచారం.
గత ఏడాది జూన్లో సెర్నర్ను ఒరాకిల్ కొనుగోలు చేయగా అప్పటినుంచి వేతన పెంపును, పదోన్నతులను నిలిపివేసింది. యూనిట్లో వేలాది ఉద్యోగులను విధుల నుంచి తొలగించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్టు ఇన్సైడర్ తెలిపింది.
సెర్నర్ కంపెనీలోని మార్కెటింగ్, ఇంజనీరింగ్, అకౌంటింగ్, లీగల్, ప్రోడక్ట్ విభాగాల్లో పలువురు ఉద్యోగులపై ఒరాకిల్ వేటు వేసిందని మాజీ ఉద్యోగి వెల్లడించినట్టు ఇన్సైడర్ రిపోర్ట్ పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు లేఆఫ్స్ను కొనసాగిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో 500 మంది ఉద్యోగులను తొలగించింది.
Read More
Layoffs | ఫిన్టెక్ యూనికార్న్లో లేఆఫ్స్ : 420 మంది జెప్జ్ ఉద్యోగులపై వేటు